💥జగనన్న 'విద్యా మరియు జగనన్న 'వసతి దీవెన💥
పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించుటకై ఆర్థిక భరోసా ఇచ్చి ప్రోత్సహించటమే పథకం లక్ష్యం.
🔔ప్రయోజనాలు🔔
\* అర్హత కలిగిన అందరికి అన్ని కోర్సులకు జగనన్న విద్యా దీవెన పథకము క్రింద పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వబడుతుంది. \* అర్హత కలిగిన అందరికి అన్ని కోర్సులకు జనగగన్న వసతి దీవెన క్రింద వసతి మరియు భోజన ఖర్చుల కొరకు సంవత్సరానికి రూ.20,000/- వరకు.
💥పాలిటెక్నిక్ కోర్సుకు రూ. 15,000/-లు, ఐ.టి.ఐ. కోర్సుకు రూ.10,000/-లు) చేల్లించబడుతుంది.
\* కుటుంబ వార్షిక ఆదాయము రూ. 2,50,000/-లోపు ఉన్నవారు అర్హులు. \* కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాల కన్నా తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాల కన్నా తక్కువ లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు.
\* కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి (సానిటరి వర్కర్లు మినహా) .
💥ఆదాయపన్ను చెల్లింపుదారు / పింఛను దారుడు ఉన్న ఎడల అర్హులు కారు.
\* పట్టణ ప్రాంతములో 1,500 చ.అ.లు కన్నా తక్కువ బిల్టప్ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం) కలిగిన కుటుంబం అర్హులు.
💥జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము \* అర్హత కల్గిన వారు తమ దరఖాస్తులను గ్రామ వార్డ్ వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ-వార్డు సచివాలయాల నందు గాని సమర్పించవలెను. మరియు www.gramawardsachivalayam.ap.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ (online) లో దరఖాస్తు చేసుకొనవచ్చును.
NOTE :: ఫ్రెండ్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.