WhatsApp Group Join Now
Telegram Group Join Now

YSR AROGYA SREE FULL DETAILES

bhadra
1


💥ఆరోగ్యశ్రీ 💥


 **ఆరోగ్యశ్రీ **అనునది** **ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న **రాజీవ్ ఆరోగ్యశ్రీ **అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వైై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు.2014 లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారక రామారావు** ఆరోగ్య సేవ **గా పేరు మార్చింది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథకంగా గుర్తింంపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా సేవలు అందిస్తారు (వైద్య సేవలు అందించడంతో పాటు రవాణా, భోజన వసతి, సదుపాయాలను కల్పిస్తారు). ఈ పథకం ద్వారా 2014 సెప్టెంబరు నాటికి 26 లక్షల మంది పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ పథకం కింద 1038 (పైగా) జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల వరకు వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీచేస్తుంది. ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని **"వైయస్సార్ ఆరోగ్యశ్రీ" **గా మార్చి అమలు చేస్తూ ఈ పథకంను మరింత విస్తృతం చేసి రాష్ట్ర జనాభాలో 90 శాతం పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచిత కార్పొరేట్ వైద్యసేవలు అందుకోవడానికి వీలు కల్పించారు. తన హయాంలో వైయస్సార్ 940 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకిిిి తెస్తే, వైయస్ జగన్ జనరల్ సర్జరీ నుంచి సైకియాట్రీ వరకు లెక్కకు మించిన వైద్య చికిత్సలను ఈ పథకంలో చేర్చి తండ్రికిి తనయుడు అనిపించుకుంటున్నారు. కరోనా బారినపడిన వారందరికీ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద అన్ని హాస్పిటల్స్ లో ఉచిత చికిత్స అందించేందుకు ఆదేశాలు ఇచ్చిన వైయస్ జగన్... దేశంలో కరోనా చికిత్సను ఫ్రీ హెల్త్ సర్వీస్ కిందకుుు తెచ్చిన తొలి ముఖ్యమంత్రి.



🌹అర్హత🌹

✨ రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు.

✨ అన్ని రకాల బియ్యం కార్డులు ఉన్నవారు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు.

✨ వైయస్సార్ పింఛన్, జగనన్న విద్యా, వసతి దీవెనకార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు.

✨12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి.. 35 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి ఉన్న భూ యజమానులు అర్హులు (లేదా) మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఎకరాల లోపు కలిగినవారు అర్హులు. 

✨ 3000 చదరపు అడుగుల స్థలం లోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు. 

✨5 లక్షల లోపు ఆదాయపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు సైతం ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. 

✨రూ.5 లక్షల లోపు వార్షికఆదాయం ఉన్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అర్హులు. 

✨ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు. 

✨ కుటుంబంలో ఒక కారు ఉన్నా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. 

**నోట్: **కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటేే ఆరోగ్యశ్రీ పథకానికి అనర్హులు.. 


**కావాల్సిన పత్రాలు: **

🔹అప్లికేషన్ ఫామ్

🔹 కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జరాక్స్ లు

🔹 రైస్ కార్డు జరాక్స్

🔹 కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో


**దరఖాస్తు ప్రక్రియ:**

_1) న్యూ ఆరోగ్యశ్రీ కార్డు_ : కుటుంబ సభ్యులందరి ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి. అలాగే వాలంటీర్ నందు, గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ నందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒక కుటుంబంగా నమోదు అయి ఉండాలి. ఆరోగ్యశ్రీ కార్డుకు అప్లై చేయదలచిన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ జరాక్సులు, న్యూ రైస్ కార్డ్ జరాక్స్, కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, అప్లికేషన్ ఫాామ్ ను జతపరచి సంబంధిత గ్రామ సచివాలయం లోని డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో ధరఖాస్తు చేసుకొనవచ్చును (లేదా) గ్రామ/ వార్డు వాలంటీీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకొనవచ్చును. దరఖాస్తు చేసిన "20 రోజులలో" అర్హులైన దరఖాస్తుదారునికి డా. వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది. 
_2) ఆరోగ్యశ్రీ కార్డు నందు సభ్యుల చేర్పు_: 
  ఎ) కొత్తగా పెళ్లి అయి కోడలు అత్తగారి కార్డులో చేర్చుట :- 
 🔹 అమ్మాయి వారి తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ అని ధృవీకరించాలి. 
 🔹 కొత్తగా పెళ్లి అయిన కోడళ్ళను అత్తగారి ఇంటిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు యాడ్ చేయవలెను. 
 🔹అలా చేసిన తరువాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యశ్రీ కార్డులో అమ్మాయి పెళ్లికి ముందు ఉంటే అక్కడ మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ అని డిజిటల్ అసిస్టెంట్ నవశకం లాగిన్ లో సబ్మిట్ చేయాలి. 
 🔹 ముందుగా లేకపోతే చేయనవసరం లేదు. 
 🔹 అప్పుడు అత్తగారి పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నవశకం నందు అప్లికేషన్ పెట్టుకోవాలి. 
 బి) a) పుట్టిన పిల్లలను చేర్చుట:- డిజిటల్ అసిస్టెంట్ వారి నవశకం లాగిన్ లో, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని డైరెక్ట్ గా యాడ్ చేయవచ్చు. 
   b) ఏ కార్డు లో లేకుండా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని చేర్చుట కొరకు:- మొదటగా వారి కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా చేర్చి తద్వారా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో చేర్చుకోవచ్చును. 
3_) ఆరోగ్యశ్రీ కార్డు నందు సభ్యుల తొలగింపు :-_
 🔹 ఒక వ్యక్తిని తొలగించాలి అంటే మొదటగా అతను/ఆమెను ను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు  " పర్మినెంట్ మైగ్రేషన్/ డెత్ డిక్లరేషన్/ టెంపరరీ మైగ్రేషన్/ మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ " లో వారికి అనుగుణంగా ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలెను. 
 🔹 తరువాత వేరే చోట చేర్చిన తరువాత నవశకం లాగిన్ నందు అతను/ఆమెకు " పర్మినెంట్ మైగ్రేషన్/ డెత్ డిక్లరేషన్/ టెంపరరీ మైగ్రేషన్/ మైగ్రేషన్ డ్యూ టూ మ్యారేజ్ " అని చూపిస్తాయి. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే; కొద్దిరోజుల్లో అతను/ఆమె ఆ కార్డు నుంచి డిలీట్ అవుతారు. 


**ఉచిత వైద్య చికిత్స:**

▪️ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

▪️ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షల వరకు వర్తింపజేస్తున్నారు. 

▪️ కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం. 

▪️ ఆరోగ్యశ్రీ లోకి " బ్లాక్ ఫంగస్ "

▪️ ఆరోగ్యశ్రీ పథకం సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందే వెసులుబాటు కల్పించడం జరిగింది. 


**ఆరోగ్యశ్రీ కార్డు - 20 రోజుల ప్రక్రియ:**

దరఖాస్తు చేసిన 20 రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి డా.వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు వాలంటీర్ల ద్వారా అందించబడును. 

_20 రోజుల ధ్రువీకరణ ప్రక్రియ కింది విధంగా ఉండును :- _

_🔺_**1 వ రోజు : **ఆర్.టి.జి.యస్ సేవల ద్వారా సిస్టం వాలిడేషన్ పొందిన దరఖాస్తును స్వీకరించబడును. 

🔺**2 వ రోజు నుంచి 6 వ రోజు వరకు : **సంబంధిత శాఖ మరియు జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్తచే పరిశీలన. 

🔺**7 వ రోజు : **యు.హెచ్.ఐ.డి ను జెనరేట్ చేయుట మరియు హెల్త్ కార్డు ఆమోదించుట. 

🔺**8 వ రోజు : **పిడిఎఫ్ ను జెనరేట్ చేసి ప్రింటింగ్ కొరకు ప్రింటర్ కు పంపుట. 

🔺**9 వ రోజు నుంచి 19 వ రోజు వరకు : **కార్డులను ముద్రించి సంబంధిత సచివాలయాలకు రవాణా చేయుట. 

🔺**20 వ రోజు : **సంబంధిత వాలంటీర్ ఆరోగ్యశ్రీ కార్డును దరఖాస్తుదారునికి, వారి ఇంటివద్ద పంపిణీ చేసి, లబ్ధిదారునికి కార్డు అందినట్లుగా, బయోమెట్రిక్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. 


**పథకం అమలుకు ముఖ్య ఉద్దేశ్యం :**

జబ్బుల బారిన పడిన పేద జనానికి మెరుగైన వైద్యం అందక ఆస్తులు అమ్ముకుని ప్రాణం కాపాడుకోవడానికి బడుగుజీవి పడే అవస్థలను చూసి సరికొత్త పథకానికి నాంది పలికింది. డబ్బులు ఉన్నవాడికే కార్పొరేట్ వైద్యం, లేనివాడు ఆరోగ్యం కోసం అప్పుల పాలైనా కావాలి లేదా ప్రాణం మీద ఆశ వదులుకోవాలి. ఈ పరిస్థితిలో సమూల మార్పు తీసుకువచ్చి, సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ధన్వంతరి మంత్రంగా ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చింది.. 

Note :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

Post a Comment

1Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సలు చేసే రోగాల జాబితాను యిక్కడ జత చేయాలి ప్లీజ్....

    ReplyDelete
Post a Comment