💌 జగనన్న తోడు పూర్తి ఇన్ఫర్మేషన్💌
🧾చిన్న వ్యాపారుల మరియు సాంప్రదాయ వృత్తి దారులు వ్యాపారాభివృద్ధి కొరకు "జగనన్న తోడు" పధకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000/ లోపు సున్నావడ్డీతో ప్రభుత్వం ఋణ సహాయము అందిస్తున్నది.
🧾ఈ పతాకం ద్వారా చాలామంది చిన్న వ్యాపారుల కోసం ఈ పథకం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా వ్యాపారులు అందరికీ 10,000 కతలో జమ అవ్వడం జరుగుతుంది.
చిరువ్యాపారులు అంటే ఎవరు?
🧾నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/ లోపు కలిగిన వారు. మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు.
🧾 ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఇతరములు) కలిగిన
దరఖాస్తు చేసుకొనే విధానము :
> అర్హత కలిగిన వారు వ్యాపార వివరాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును.
> అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.
> దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి బ్యాంకుల ద్వారా సున్నావడ్డీతో రూ.10,000/- లోపు ఋణం ఇప్పించబడును.
> లబ్ధిదారులు బకాయి లేకుండా వడ్డీతో బ్యాంకునకు నెలసరి కంతులు / వాయిదాలు చెల్లించిన యెడల, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి వడ్డీని లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది